అమరావతికి మరో ఇన్నర్ రింగ్ రోడ్డు రూ. 48 కోట్లతో..! ఈ రూట్లోనే, పనులు ప్రారంభం!
Thu May 29, 2025 07:54 Politics
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం త్వరలో మొదలు కానుంది. గతంలో ఆగిపోయిన ఈ పనులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. భూసేకరణ పూర్తి చేసి, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.. ప్రస్తుతం నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ మూడో దశ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం స్వర్ణభారతినగర్ దగ్గర 382 ఇళ్లను రోడ్డు కోసం తొలగించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులు, ప్రజల ప్రతినిధులు భూమి కోల్పోయిన వారితో చర్చించారు. ఇప్పటికే ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు పొందినవారు 290 మంది ఉండగా.. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వెంటనే రూ. 6.35 కోట్ల పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది.. దీంతో సీఆర్డీఏ త్వరగా పనులు మొదలు పెట్టనుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ. 48 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ రింగ్ రోడ్డు పూర్తయితే పేరేచర్ల నుంచి ఆటోనగర్ దగ్గర విజయవాడ వెళ్ళే మార్గానికి కలుస్తుంది. పల్నాడు, రాయలసీమ, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా అమరావతి, విజయవాడకు సులువుగా చేరుకోవచ్చు. పలకలూరు, జేకేసీ కళాశాల రోడ్డు వైపు నుంచి కూడా కనెక్షన్ ఉంటుందంటున్నారు. భూసేకరణ కొన్ని రోజుల్లో పూర్తి చేసి భూమిని సీఆర్డీఏకి అప్పగిస్తాము
అంటున్నారు గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు. 80 అడుగుల వెడల్పుతో 1.91 కిలోమీటర్ల మేర రోడ్డుకు కావాల్సిన భూమిని సేకరిస్తున్నామని.. సీఆర్డీఏ రింగ్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసిందన్నారు. సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నిర్ణయం తర్వాత మిగిలిన ప్రక్రియ చేపడతారన్నారు.
వాస్తవానికి గుంటూరుకు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చాలా ఏళ్ల క్రితం ప్రతిపాదించారు.. 2005లో వీజీటీఎం వుడా దీన్ని తెరపైకి తీసుకొచ్చింది. 2010-14 మధ్య మొదటి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం మీదుగా అమరావతి రోడ్డు వరకు 4.7 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. 2014లో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతినగర్ వరకు రెండో దశలో రూ. 29.08 కోట్లతో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఈ ప్రాంతం రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లి. మూడో దశలో పలకలూరు మార్గానికి కలుపుతూ 4.25 కిలోమీటర్ల మేర రోడ్డు చేయడానికి సీఆర్డీఏ రూ.33 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనులు ఆగిపోయాయి.. కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ పనుల్ని చేపడుతోంది.
ఇది కూడా చదవండి: రైతులకు కేంద్రం గుడ్న్యూస్! వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు శుభవార్త! విశాఖ-భువనేశ్వర్ ఎయిర్ లింక్కు గ్రీన్ సిగ్నల్ !
5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్..! రివాల్యుయేషన్ పెట్టగా..!
ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ..! ప్రభుత్వం అధికారిక ప్రకటన!
ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు..! సీఎస్ ఉత్తర్వులు జారీ!
అమెరికా మరో కీలక నిర్ణయం! విద్యార్ధి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా బ్రేక్..!
జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ! గల్ఫ్ మోసాల కేసులో..!
ఆర్ఆర్బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్డేట్ మీకోసమే..!
రూ.లక్షలోపు రుణమాఫీ.. వీరికి వర్తింపు! మార్గదర్శకాలు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #AmaravatiDevelopment #InnerRingRoad #APInfrastructure #AmaravatiRoadProject #₹48CroreProject
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.